హైదరాబాద్, వెలుగు: ఏఐ ప్లస్ సంస్థ ఇండియా మార్కెట్లోకి శనివారం ఆరు ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో మూడు ఇయర్బడ్స్, మూడు స్మార్ట్వాచ్లు ఉన్నాయి. నోవాపాడ్స్ గో ధర రూ.699 కాగా, నోవాపాడ్స్ ప్రో రూ.1,999 కి లభిస్తుంది. క్లిప్స్ మోడల్ రూ.3,999 కు అందుబాటులో ఉంది. నోవావాచ్ యాక్టివ్ ధర రూ.2,499 ఉంటుంది.
పిల్లల రక్షణ కోసం నోవావాచ్ కిడ్స్ 4జీని రూ.2,999 కు తెచ్చారు. అత్యంత ఖరీదైన నోవావాచ్ వేర్బడ్స్ ధర రూ.7,999. ఇందులో చాట్ జీపీటీ సదుపాయం ఉంది. ఏఐ ప్లస్ పల్స్ 2 ఫోన్ను కూడా విడుదల చేసింది. లాంచ్ ఆఫర్ కింద 4జీబీ 64జీబీ వేరియంట్ రూ.5,999 కే లభిస్తోంది. ఆ తర్వాత దీని ధర రూ.7,499 కు పెరుగుతుంది.
6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.ఎనిమిది వేలు. ఈ ఫోన్లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్, వెనుక 50ఎంపీ ఏఐ కెమెరా, ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.74 అంగుళాల, నెక్స్ట్ క్వాంటం ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
